ఆ తరువాత ఆమె ను జహంగీర్ ఆగ్రాకు తీసుకువస్తాడు. అక్కడ అక్బర్ భార్య మహారాణి రుకమై సుల్తాన్ బేగం కొలువులో పనిచేస్తుంటుంది. రుక్మయి బేగం సలీంకు సవతి తల్లి అవుతుంది. మహారాణి తో అత్యంత సన్నిహితంగా మెలగడం తో నూర్జహాన్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం ఉండేది. సొంత కూతురిలా ఆమెను చూసుకునేది మహారాణి. అయితే ఒకరోజు మీనా బజార్ లో మహారాణి తో ఉన్న నూర్జహాన్ ని చూసి ఆమె అందానికి ఆకర్షితుడై వెంటనే తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరతాడు. మహారాణి అంగీకరించడంతో నూర్జహాన్ కూడా సరేనని చెబుతుంది. 1621 సంవత్సరంలో వీరిద్దరి వివాహం తరువాత మొగల్ సామ్రాజ్యానికి మహారాణి అయ్యింది నూర్జహాన్.
జహంగీర్ మాజీ భార్య సలేహ చనిపోవడంతో ఆమె స్థానంలో నూర్జహాన్ మహారాణి అయ్యింది. ఆమె పాద్ శా బేగం గా కొనసాగుతుంది. ఆమె మహారాణి అయ్యాక మొగల్ సామ్రాజ్యం పై సర్వాధికారాలను పొందింది. దీంతో రాజ్యం కోసం దాదాపుగా ఆమె అన్ని నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. తనకు ఇష్టం ఉన్న మంత్రుల నియమించేది. పత్వాలను జారీ చేసేది. తన నాణేలను కూడా ముద్రించింది. అలాగే తన తండ్రి ఇంతియాడ్ దౌలా, సోదరుడు అసఫ్ ఖాన్, షాజహాన్ తన తల్లి అస్మత్ బేగం ఇతర మంత్రులతో కలిసి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వారందరితో కలిసి రాజ్యపాలన అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేది. ఈ విధంగా నూర్జహాన్ కొలువులో దాసిగా చేరి ఆ తర్వాత మహారాణిగా ప్రపంచాన్ని సాధించింది.