భారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ముగిసింది 2-1 తో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ టి20 సిరీస్ కి సమాయత్తమవుతోంది . శ్రీలంక గెలవడానికి ఎలాంటి అవకాశం లేకుండా ఆత్మవిశ్వాసంతో సరైన టీమ్ తో పాల్గోని సమిష్టిగా రాణించి టీ20 సిరీస్ ని సైతం కైవసం చేసుకుంటామని శిఖర్ ధావన్ స్పష్టం చేస్తున్నారు. ఇక చివరి వన్డేలో గెలిచి శ్రీలంక సైతం కాస్త ఆత్మవిశ్వాసం గానే కనిపిస్తోంది టి20 లో విజయం సాధించాలని తహతహలాడుతోంది లంక టీం. ఇక నేటి సాయంత్రం 8 గంటలకు ప్రారంభం కానున్న టి20 మ్యాచ్ లో భారత్ నుంచి ఓపెనర్లు గా ధావన్, పృథ్వీషా ఆడనున్నారు.

ఇక శ్రీలంక టీం కి కొత్త కెప్టెన్ దసున్‌ షనక నాయకత్వంలో టీం నిలకడగానే సామర్థ్యం మేరకు రాణిస్తోంది. వన్డే సిరీస్ లో రెండవ మ్యాచ్ లో గెలిచిన శ్రీలంక టీం మూడో వన్డేలో విజయం సాధించి పరువు పోకుండా కాపాడుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: