కంటిన్యూగా సినిమాలతో బిజీగా ఉన్న అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఇప్పటికే గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్నో చిత్రాలను నిర్మించి విజయాలు దక్కించుకున్నారు.గీతా ఆర్ట్స్ ద్వారా స్టార్ హీరోలు చిత్రాలు నిర్మిస్తున్న ఆయన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో కొత్త నటీనటులను ప్రొత్సహిస్తున్నారు.మొత్తానికి నిర్మాతగా వరుస సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్న ఆయన తాజాగా బ్రాండ్ న్యూ లగ్జరీ కారు కొన్నారు. ఇప్పటికే పలు కాస్ట్రీ కార్లు అరవింద్ గ్యారేజ్లో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బీఎండబ్ల్యూను కూడా తన కార్ల గ్యారేజ్లో చేర్చారు. అయితే ఈసారి లగ్జరీ సౌకర్యాలతో కూడిన అత్యాధునిక ఫిచర్ కలిగిన బ్రండ్ న్యూ కారును ఆయన కొనుగొలు చేసినట్టు తెలుస్తోంది. బీఎండబ్య్లూ ఐ7 ఈవీ  ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేశారు. ఇటీవల దీనికి బీఎండబ్య్లూ షో రూం వారు స్వయంగా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కారు హ్యాండోవర్ చేశారు. షో రూం నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లడం వరకు కారు వీడియోను సదరు సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ఈ కారు లోపల వీడియోను కూడా చూపించారు.

ఈ కారులో మొత్తం లగ్జరీ సౌకర్యాలతో స్టైలిష్గా ఉంది. ఇక ఈ కారు ఫీచర్స్ తెలిస్తే అవాక్కావ్వాల్సిందే.ఈ ఎలక్ట్రిక్ కారు ధర ఏకంగా 2.5 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. నెటిజన్లు ఈ కారు ఖరీదు తెలిసి షాకవ్వడం జరుగుతుంది.బన్నీ  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కూడా అల్లు అరవింద్ ఒక సినిమాను ప్లాన్ చేయగా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాల్సి ఉంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా పూర్తైన తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అల్లు అరవింద్ నిర్మాతగా పాన్ ఇండియా హిట్లను సాధించాలని భావిస్తున్నారు. బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో గీతా ఆర్ట్స్ భాగస్వామ్యం ఉండనుందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.అల్లు అరవింద్ ప్రస్తుతం తన హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ పై తండేల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.చిత్రీకరణ దశలో ఉన్న తండేల్ మూవీ 2024 ఎండింగ్ లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: