ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు బిల్లులతో షాక్ కొట్టేలా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రూ అప్ పేరుతో జ‌గ‌న్ ప్రజల జేబులను ట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. కరెంట్ బిల్లులతో దళిత కుటుంబాలు చీకటిలో బ్రతకాల్సి వస్తోంద‌ని, జగ్జీవన్ జ్యోతిని ఆర్పాలనే జగన్ ఆలోచనని, ఉచిత కరెంట్ సంగతి ఎలా ఉన్నా, బిల్లులతో సామాన్యుడు బేజారెత్తిపోతున్నాడని, రైతు మెడకు మీటర్లతో ఉచ్చు బిగుస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ఉచిత కరెంట్ ఉట్టికేగినట్టేనని, విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి.. అధికారంలోకి వచ్చాక ఈ బాదుడేంటో సిఎం జగన్ చెప్పాలన్నారు. ఆ బాధ్య‌త కూడా ఆయ‌న‌పైనే ఉంద‌ని, ప్ర‌జ‌ల‌కు స‌మాధాన‌మివ్వాల‌ని, అలా తాడేప‌ల్లిలోని ఇంట్లో మౌనంగా కూర్చుంటే ఉప‌యోగం ఉండ‌ద‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి కూడా మౌనంగా ఉంటార‌ని, ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఇలాగే మౌనంగా ఉంటున్నార‌ని, మౌనంగా ఉండ‌టంవ‌ల్ల త‌ప్పులు ఒప్ప‌వ‌వ‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: