అండర్ -19 క్రికెట్ లో ఆడిన మాజీ కెప్టెన్ అవి బరోట్ (29) గుండె పోటుతో మరణించారు. అవి బరొట్ సౌరాష్ట్ర జట్టుకు ప్రాతనిథ్యం వహించారు. 2019, 2020 సీజన్ లో రంజీ ట్రోఫీ గెలిచిన టీమ్ లో ఒక సభ్యుడిగా ఉన్నారు. బారొట్ 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 1,547 రన్నులు చేశాడు. లిస్ట్ - ఏ క్రికెట్ లో 1,030 రన్స్ చేయగా.....దేశ వాళీ టీ20 ల్లో 717 పరుగులతో బరోట్ సత్తా చాటారు. అంతే కాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో గోవాతో జరిగిన మ్యాచ్ లో 53 బంతుల్లో 122 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్ లో బరోట్ ఆట తీరు చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. అయితే ఎంతో భవిష్యత్ ఉన్న బరోట్ చిన్న వయసులోనే మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇక బరోట్ మృతి పై తోటి క్రికెటర్లు...క్రికెట్ అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలి కాలం లో ఎక్కువగా యువకులే గుండె పోటుతో మరణిస్తున్న ఘటన లు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పట్లో జిమ్ లో ఓ యువకుడు...రీసెంట్ గా బాలీవుడ్ యువ నటుడు గుండె పోటుతో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: