డిసెంబరు 8 న వైసీపీలోని బీసీల ఆత్మీయ కలయిక సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పడి కూడా రెండేళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ల ఛైర్మెన్లు, మెంబర్లు, ఆలయ కమిటీల ఛైర్మన్లు, డైరెక్టర్లు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మెన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యుల వరకు.. అందర్నీ ఈ బీసీ సమ్మేళనానికి ఆహ్వానించనున్నారు.


నిన్న అందుబాటులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ బీసీ నాయకులు పార్టీ పెద్దలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.  మూడున్నరేళ్ళ పాలనలో బీసీ వర్గాలకు జరిగిన మేలు, బీసీల జీవన ప్రమాణాలు ఎలా పెరిగాయి, గ్రామ స్థాయి నుంచి బీసీ వర్గాలకు పెరిగిన రాజకీయ ప్రాధాన్యత.. తదితర అంశాలపై చర్చించుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నామని..  672 మంది డైరెక్టర్లను నియమించామని.. ప్రభుత్వ కార్పొరేషన్లలో కూడా 122 మందిని బీసీలను నియమించడం జరిగిందని వారు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: