తెలుగు చిత్ర సీమ ముద్దుబిడ్డ ..తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కుర్తి పథకాలలో నిలిపిన గొప్పనటుడు , నాయకుడు అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో ఇన్ మరియు నటి పూనమ్ కౌర్ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పిచారు ..అయితే ఇందులో ఏంటి విశేషం అని అనుకుంటున్నారా ...ఆమె అర్పించిన నివాళు కాదండి..ఆమె చేసిన ట్వీట్ ఓ చంచలనం గా మారింది...ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించి దానికి సంబందించిన ఫోటో ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది ..
అయితే ఆమె ఆ ఫొటోకు..''తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ఆరాధ్య దేవుడు. స్వర్గంలో ఉన్న మీరు నన్ను ఆశీర్వదించండి. దుష్ట శక్తులతో పోరాడే ధైర్యాన్నిచ్చేలా దీవించండి. మానవత్వం బొత్తిగా కరవైన ఈ రోజుల్లో మీ వంటి నేతలు, మీ వంటి నటుల అవసరం ఎంతో ఉంది'' అని టాగ్ లైన్ పెట్టింది. అయితే ఇప్పుడు అందరి మైండ్ ని తొలుస్తున్న విషయం ఏమిటంటే ..ఆ దృష్ట శక్తి ఎవరా అని ...అయితే గత కొంత కాలంగా ఈమె పేరుపొందిన హీరో మరియు డైరెక్టర్ పై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే ..కానీ ఈ ట్వీట్ లో ఎవరిని ఈమె టార్గెట్ చేసిందా ని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. తాజాగా ఈమె ఓ పేరొందిన పార్టీ లో తీర్ధం పుచ్చుకోవాలని అనుకుంటోంది ..అయితే ఈ స్టంట్ అంతా అందుకోసమేనేమో అని అందరు అనుకుంటున్నారు .
#NTRJayanthi ....... god of telugu people ...bless me from heaven .... bless me that I fight the evils ..... leaders like you n actors like u are the most needed now where there is humanity lacking ....#NTRamaRao #Hero pic.twitter.com/h4JW6ReAzb
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 28, 2020