సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్‌ ఏచూరి (34) కరోనా వైరస్‌ బారిన పడి గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆశిష్‌ ఏచూరి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఈ బాధాకర సమయంలో ఏచూరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇక.. సీపీఎం సీనియ‌ర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడి మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆయన అధికారిక ట్వీట్టర్ ఖాతలో.. "సీతారాం ఏచూరి గారి కుమారుడి మరణ వార్త నన్ను కలిచి వేసింది. వారికి, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను"అని ట్వీట్ పోస్ట్ చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: