తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌దైన ముద్ర వేసుకున్నారు.ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ హీరోకి లేరు.ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో అదే ఇవ్వ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌య‌త్నిస్తారు.హీరో త‌న సొంత గొంతుతో పాట‌పాడి త‌న ఫ్యాన్స్‌ని మెప్పించిన ఏకైక న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే చెప్పాలి. అత్తారింటికి దారేది సినిమాలో తివిక్ర‌మ్ శ్రీనివాస్ సూప‌ర్ స‌క్సెస్ కొట్టారు. ఆ త‌రువాత అజ్ఞాతవాసి సినిమాలో మంచి ఊపుతో ప‌వ‌ర్ స్టార్ పాట‌లు పాడారు. కొడ‌కా కోటేశ్వ‌ర‌రావు అంటూ త‌న ఫ్యాన్స్ ఉర్రూత‌లూగించారు ప‌వ‌న్‌. అయితే తాజ‌గా ప‌వ‌న్ మ‌రో పాట‌ను పాడ‌నున్నారు. ఫోక్ సాంగ్‌తో  ప‌వ‌న్ ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నారు. సాగ‌ర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ లో ప‌వ‌న్ కోసం ఓ ఫోక్ సాంగ్ రెఢీ అవుతోంది.ఈ విష‌య‌న్ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ స్వ‌యంగా వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: