కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా రిజర్వ్ బ్యాంకు వ్యవహరించకపోవడం వలన ఆ బ్యాంక్ పై తన పట్టును పెంచుకోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ రిజర్వ్ బ్యాంకు చట్టం - 1934 లోని సెక్షన్ 7 ను ఉపయోగించింది. ఇలా చేయడంతో బ్యాంక్ యొక్క స్వతంత్ర హరించి  కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం పెరిగింది. ఇంతకీ సెక్షన్ 7 అంటే ఏమిటో , వాటి అధికారాలు గురించి కింద చదవండి.



రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ను 1926లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ సిఫార్సు మేరకు ఏర్పాటు చేశారు. దీని కోసం 1934లో చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారం 1935 ఏప్రిల్ 1 న భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం - 1934 ప్రకారం ఆర్.బి.ఐ ఏర్పాటు అయ్యింది. 



1.ఈ చట్టం లోని సెక్షన్ 7 కింద కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకుకు నిర్దిష్ట మైన ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంది.



2. సెక్షన్ 7 (1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రయోజనాలు కోసం అవసరమైతే ఆర్బీఐ గవర్నర్ తో చర్చలు జరిపిన అనంతరం , ఎప్పటికప్పుడు ఆర్బీఐ కి ఆదేశాలు జారీ చేయవచ్చు. 



3. సెక్షన్ 7(2) ప్రకారం ఆర్బీఐ ని గవర్నర్ లేకుండా తన కేంద్ర బోర్డు డైరెక్టర్ల ద్వారా నడిపించేందుకు సైతం ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. 



4. ఆర్బీఐ చట్టం లోని ఈ సెక్షన్ ద్వారా ప్రభుత్వం అటు గవర్నర్ ను కానీ , డిప్యూటీ గవర్నర్ ను కానీ ఎటువంటి సంజాయిషీ లేకుండానే తొలగించడానికి అధికారం ఉంది. 



5. ఆర్బీఐ గవర్నర్ , నలుగురు డిప్యూటీ గవర్నర్ లను ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని నియామకాల మంత్రివర్గ సంఘం (ఏసీసీ) నియమిస్తుంది. 



కేంద్రం ఈ సెక్షన్ ను ప్రయోగించి ఆర్బీఐ మీద పట్టు సాధించడమే కాకుండా బ్యాంక్ వద్ద ఉన్న మిగులు నిల్వలలో సగాన్ని ఆర్థిక శాఖల ఖాతాల్లోకి మళ్లించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: