రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు కావటంతో ప్లాట్ లు అమ్ముతున్నామంటూ మెసేజ్ లు వెల్లువెత్తుతున్నాయి. కాశ్మీర్ లో ప్లాట్ లు కొంటారా..శ్రీనగర్ లో దాల్ సరస్సు సమీపంలో ప్లాట్ కావాలా.. అంటూ ఎస్సెమ్మెస్ లు చేస్తున్నారు. ఇదే విషయం సోషల్ మీడియాలో కుడా ట్రోల్ అవుతోంది.
ఎస్సెమ్మెస్ లో నెంబర్ కు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తుండడంతో ఆ మెసేజ్ తో తమకు సంబంధం లేదని సదరు రియల్ ఎస్టేట్ సంస్థ వివరణ ఇచ్చుకుంది. కోల్ కతాకు చెందిన ఆ రియల్ ఎస్టేట్ సంస్థ తాము కశ్మీర్ లో ప్లాట్ లు అమ్ముతున్నట్టు ఎవరికీ ఎటువంటి ఎస్సెమ్మెస్ లు పంపలేదని వివరణ ఇచ్చింది. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ సచిదానంద రాయ్ 2003 లో స్తాపించారు.
తమ నెంబర్ తో వస్తున్న మెసేజ్ ల పై విచారణ జరపాలని కోల్ కతలో సైబర్ క్రైం పోలీసులకు విజ్ఞప్తి చేసింది. పోలీసులు కూడా ఇటువంటి ఎసెన్స్ లతో మోసపోవద్దని ప్రజలకు సూచించారు. హైదరాబాద్ వాసులకు కూడా ఇటువంటి మెసేజ్ లు వచ్చాయి. ఇటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.