సాధారణంగా పసిపిల్లలను చూస్తే ఎవ్వరికైనా సరే  మనసు పులకరించి పోతూ ఉంటుంది. ఆ పసిపిల్లలను ఒకసారి దగ్గరికి తీసుకొని మనసుకు హత్తుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎంత  టెన్షన్ లో ఉన్న పసిపిల్లల  చిరునవ్వు చూస్తే ఆ టెన్షన్ మొత్తం పోతుంది అని చెప్పాలి.  అయితే సాధారణంగా చిన్నారులు  స్కూల్ కి వెళ్ళిన సమయంలో వారికి సరిగ్గా తినడమే తెలియదు. అలాంటిది ఇక కాలకృత్యాలు తీర్చుకోవడం అనేది అసాధ్యం అని చెప్పాలి.  కానీ మూత్రం ఎప్పుడు వస్తుంది మలం  ఎప్పుడు వస్తుంది అన్నది మాత్రం చెబుతూ ఉంటారు కొంతమంది విద్యార్థులు.


 ఈ క్రమంలోనే ఇక చిన్నారులను చూసుకునే టీచర్లు కూడా ఎంతో ఓపికగా అన్నీ చూసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ  ఒక కిరాతక టీచర్  మాత్రం దారుణానికి పాల్పడింది.  పదేపదే మూత్రం పోస్తున్నాడు  అన్న కారణంతో ఓ చిన్నారి ప్రైవేట్ పట్టుకుని నిప్పంటించింది.  ఈ దారుణమైన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. ఏకంగా పురుషాంగానికి వాత పెట్టడంతో ఆ చిన్నారి విలవిలలాడి పోయాడు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా లో అంగన్వాడి సెంటర్ లో ఓ చిన్నారి తరచూ మూత్ర విసర్జన చేస్తూ ఉన్నాడు.


 ఈ క్రమంలోనే పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన అంగన్వాడీ టీచర్ కోపంతో ఊగిపోయింది.  ఈ క్రమంలోనే ఆ చిన్నారిని భయపెట్టాలి అనే ఉద్దేశంతో ప్రైవేట్ పార్ట్ కు వాత  పెట్టింది. దీంతో ఎంతగానో గుక్కపెట్టి ఏడుస్తూ విలవిలలాడి పోయాడు చిన్నారి. చిన్నారి పురుషాంగం తో పాటు తొడల పైన కూడా వాతలు పెట్టినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. కాగా 15 రోజుల క్రితమే ఆ బాలుని తల్లి  కన్నుమూసింది. చివరికి తన అమ్మమ్మ తో కలిసి ఉంటున్నాడు బాలుడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: