ఇటీవలి కాలంలో మనుషులు మానవత్వాన్ని కోల్పోతున్నారు. బంధాలకు బంధుత్వాలకు అస్సలు విలువ ఇవ్వడం లేదు. ఏకంగా సొంత వారి విషయంలోనే దారుణంగా ప్రవర్తిస్తూ సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తున్నా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. క్షణకాల  సుఖం కోసం పరితపిస్తూ సొంత మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. ఇలా నేటి రోజుల్లో ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. ప్రియుడి కోసం ఏకంగా సొంత తమ్ముడు నే పొట్టనపెట్టుకుంది ఇక్కడ ఒక యువతి.




 ఈ ఘటన నాగపూర్ లో చోటుచేసుకుంది. ఓ యువతి యువకుడితో ప్రేమాయణం సాగిస్తుంది. అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఇటీవలే ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని ప్రియుడితో ఏకాంతంగా గడపాలని అనుకుంది. కానీ అంతలోనే ఊహించని ట్విస్ట్ ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న  సమయంలో యువతి సోదరుడు ఇంటికి చేరుకున్నాడు. దీంతో ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా షాక్ అయింది. ఇక తన ప్రియుడితో రాసలీలలకు  సంబంధించిన బండారం మొత్తం బయట పడుతుంది అని అయోమయంలో పడిపోయింది.



 మమ్మల్ని లోపల చూస్తే ఇదంతా తల్లి దండ్రులకి తమ్ముడు ఎలాగో చెప్పేస్తాడు.. అదంతా జరగ కుండా ఉండాలి అంటే తమ్ముడిని చంపేయాలి  అని ఆ అక్క భావించింది. ఈ క్రమంలోనే ప్రియుడి తో కలిసి ఏకంగా తమ్ముడు గొంతు నులిమి చంపేసింది. అప్పటి వరకూ ఆరోగ్యం గా సంతోషం గా ఉన్న కుమారుడు అకస్మాత్తుగా చని పోవడం పై తల్లి దండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. దీంతో యువతితో పాటు అతడి ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: