మహిళ అబల కాదు సబల అని చెబుతూ ఉంటారు. ఏ కష్టం వచ్చినా కూడా ఏకంగా అపర కాళిలా గా ఉగ్రరూపం దాలుస్తోంది అంటూ ఉంటారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం మహిళలు తమలో ఉన్న శక్తిని కూడా గుర్తించకుండా.. చిన్న విషయాలకే భయపడిపోతూ ఉండడం గమనార్హం. మహిళలు తిరగబడి పోరాడితే అత్యాచారాలు లాంటివి కూడా జరగవు అని ఇప్పటికే ఎంతోమంది సూచనలు కూడా చేస్తున్నారు. కానీ మహిళలు మాత్రం ఎందుకో భయాన్ని వదలటం లేదు. కానీ ఇటీవల కాలంలో కొంత మంది మహిళలు మాత్రం ఏకంగా అపర కాళిలా గా ఉగ్రరూపం దాలుస్తూ మహిళ అంటే అబల కాదు సబల అని నిరూపిస్తూన్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆమె అందరిలాగానే ఒక సాధారణ గృహిణి. భర్త చాటు బాగానే జీవనం సాగిస్తూ వస్తోంది.. ఎప్పుడూ గొడవలు కి పోకుండా సర్దుకుపోయి బ్రతుకుతూ ఉంటుంది. కానీ ఇటీవలే అనుకోని విధంగా ఒక సమస్య వచ్చిపడింది. దీంతో ఆ సమస్యకు భయపడి పోవడం కాదు అపర కాళిలా గా  మారిపోయింది సదరు మహిళ. భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి ఉగ్రరూపం దాల్చింది. ప్రాణాలు తీయడానికి వచ్చిన దుండగులు కళ్లల్లో కారం చల్లి మాంగల్యాని కాపాడుకుంది. ఈ ఘటన వరంగల్ పట్టణంలోని శంభునిపేట లో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు వేముల భూపాల్. ఇక ఇటీవలే అతని ఇంటికి నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చారు. ఇక ఈ నలుగురు వ్యక్తులు కూడా వెంట తెచ్చుకున్న కత్తులతో భూపాల్ ఇంట్లోకి వెళ్లి దాడి చేయడం మొదలుపెట్టారు.. దీంతో భర్త పెద్దగా అరవడంతో భార్య కల్యాణి అప్రమత్తమైంది.. ఇక వెంటనే వంటగదిలోకి పరిగెత్తుకొని వెళ్ళింది..కారం పొడి చేతిలో పట్టుకొని వచ్చి దుండగుల కళ్ళల్లో చల్లింది.ఇక కాపాడాలి అంటూ పెద్దగా కేకలు వేయడంతో భూపాల్ సోదరుడు క్రాంతికుమార్ అక్కడికి చేరుకున్నాడు. అయితే అప్పటికే నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా.. అందులో ఒకడైన రంజిత్ చివరికి చిక్కాడు. వెంటనే  పోలీసులకు సమాచారం అందించి పోలీసులకు నిందితుని అప్పగించారు. బాధితుల  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భూ తగాదాల వల్లే ఈ హత్య జరిగిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: