ఇటీవలి కాలంలో ఉద్యోగం వ్యాపారం చేసుకుని వచ్చిన దాంట్లో సర్దుకుపోయి బ్రతకడం అంటే అక్రమాలకు పాల్పడి  జల్సాలు చేయడానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. ఎన్నో నిషేధిత పదార్థాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్. అయితే అటు అక్రమార్కులు ఎంత వినూత్నంగా ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసులు ఎక్కడికక్కడ  మాదకద్రవ్యాల సరఫరాపై ఉక్కుపాదం మోపుతూ షాక్ ఇస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో అయితే ఇలా అక్రమంగా గంజాయి మాదక ద్రవ్యాలు లాంటివి చేస్తున్న ఎన్నో ముఠాలను అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోసారూ పోలీసులు.


 అయితే అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ ఏదో ఒక విధంగా పోలీసుల కళ్లుగప్పి అక్రమాలకు పాల్పడెందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. దాదాపు 225 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ ఏకంగా 55 లక్షలకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.



 ఇటీవలి కాలంలో సినిమాలను చూసి ఎంతో మంది అక్రమార్కులు ప్రభావితం అవుతున్నారన్న విషయం తెలిసిందే.  సినిమాలో చేసినట్లుగానే గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే పుష్ప సినిమాలో లాగానే ఒక లారీ లో సీక్రెట్ గా అమర్చి ఉన్న అరలో గంజాయిని పెట్టారు. ఇక పోలీసులు గుర్తు పట్టలేరులే అని అనుకున్నారు. కానీ పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు చివరికి ముగ్గురిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ముఠా  వద్ద నుంచి ఒక వాహనం తో పాటు 35 వేల నగదు, రెండు మొబైల్స్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై  పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పుకొచ్చారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: