నేటి టెక్నాలజీ యుగంలో మనిషి జీవనశైలిలో ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. టెక్నాలజీకి అనుగుణంగానే జీవనశైలిని మార్చుకోవడంలో ముందు ఉంటున్నాడు మనిషి. కానీ నేటి ఆధునిక యుగంలో మనిషిలో ఉండే విచక్షణ జ్ఞానం మాత్రం రోజురోజుకీ పూర్తిగా తగ్గిపోతుందేమో అనే భావన అందరిలో కలుగుతుంది. దీనికి కారణం నేటి రోజుల్లో వెలుగులోకి వచ్చే ఘటనలే. ఒకప్పుడు సాటి మనుషులకు ఏదైనా సమస్య వస్తేనే అయ్యో పాపం అంటూ జాలిపడేవాడు మనిషి. కానీ ఇప్పుడు ఇక సాటి మనిషికి మరో మనిషి సమస్యగా మారిపోయాడు. ఏకంగా చిన్నచిన్న కారణాలకే దారుణంగా ప్రాణాలు తీసేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు.


 ఒకప్పుడైతే పరాయి వాళ్ళు ఎటు పోతే మాకేంటి మా కుటుంబం నేను బాగున్నానా లేదా అని స్వార్ధంగా ఆలోచించేవాడు మనిషి. కానీ ఇప్పుడు నేను అనే స్వార్థం నిండిపోయిన మనిషి సొంత వారి విషయంలో కూడా కర్కశంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు తోడబుట్టిన వారి విషయంలో కూడా కాస్తయినా మానవత్వం లేకుండా దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయ్.  ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన గురించే.


 సాధారణంగా తల్లిదండ్రులు గొడవ పడుతున్నప్పుడు పిల్లలు ఆ గొడవను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఏదో ఒక టైంలో ఇలాంటిది చేసే ఉంటారు. అయితే ఇక్కడ ఒక యువకుడు తల్లిదండ్రులు గొడవ పడుతుంటే.. ఆపడానికి వెళ్ళాడు. కానీ ఇక అక్కడే అతని కోసం మృత్యువు వేచి చూస్తుందని ఊహించలేదు. ఏకంగా కోపంతో తండ్రి కన్న కొడుకుని హత్య చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. బిజినేపల్లి మండలం నందివడ్డేమానుపల్లిలో నాగయ్య, తిరుపతమ్మ దంపతులు ఇటీవల గొడవపడ్డారు. ఈ క్రమంలోనే 22 ఏళ్ళ కుమారుడు శివ ఆపేందుకు మధ్యలో వెళ్ళగా.. మద్యం మత్తులో ఉన్న తండ్రి నాగయ్య కొడుకును కత్తితో పొడిచాడు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించిన అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: