తెలుగు రాష్ట్రాల సమస్యలు సహకారంతో పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.రామోజీరావు గురించి మాట్లాడుతూ, ఆయన ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి గొప్ప స్థాయికి చేరిన వ్యక్తని రాధాకృష్ణన్ కొనియాడారు. రామోజీరావు తన ఆలోచనలను సంస్థలుగా మలిచి సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడ విపత్తు సంభవించినా రామోజీరావు స్పందించి, దానం చేస్తూ ప్రజలను భాగస్వాములను చేశారని ఆయన గుర్తు చేశారు.
రామోజీ ఎక్స్లెన్స్ అవార్డులు చరిత్ర సృష్టించబోతున్నాయని, విజేతలకు అభినందనలు తెలిపారు.మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాధాకృష్ణన్ సూచించారు. తప్పుడు సమాచారం, ఫేక్ వార్తలు సమాజానికి పెను సవాలుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు యుగంలో ఫేక్ న్యూస్ను కనిపెట్టడం కష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు. మీడియా సంస్థలు సత్యాన్ని మాత్రమే ప్రచురించాలని ఆయన కోరారు.
భారతదేశం కొత్త యుగంలోకి అడుగుపెడుతోందని రాధాకృష్ణన్ అన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. రామోజీరావు ఆర్ఎఫ్సీని అద్భుతంగా తీర్చిదిద్దారని, స్క్రిప్ట్తో వస్తే ఫస్ట్ ప్రింట్తో వెళ్లేలా చేశారని ఆయన ప్రశంసించారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి అందరూ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి