ఎన్టీపీసీ ఒక్కో మెగావాట్ నిర్మాణ ఖర్చును పన్నెండు పాయింట్ ఇరవైమూడు కోట్లుగా స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు కోట్లుగా చూపిస్తోందని హరీశ్ రావు లెక్కలు వివరించారు. యాదాద్రి ప్లాంట్ ఏడు పాయింట్ నలభైమూడు కోట్లకే వచ్చినా రామగుండం ప్లాంట్ ధరను దాదాపు రెట్టింపు చేశారని ఆరోపించారు. ఈ మూడు ప్లాంట్లకు గాను యాభై వేల కోట్లు కేటాయిస్తే పద్దెనిమిది నుంచి ఇరవై వేల కోట్లు అవినీతిలో కొల్లగొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్టీపీసీ ఛైర్మన్ హైదరాబాద్ వచ్చి రూపాయి పెట్టుబడి లేకుండా తక్కువ ధరకు విద్యుత్ ఇస్తామని మూడు ఉత్తరాలు రాసినా ప్రభుత్వం స్పందించడం లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ తెలంగాణకు ప్రత్యేక ప్లాంట్ కడితే ధర ఎక్కువ అవుతుందని రేవంతే అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. అయినా ఆ ఆఫర్ను తిరస్కరించి అప్పుల భారం మోపి కమిషన్ల కోసం ప్లాంట్లు కడుతున్నారని ఆరోపించారు.
ఎస్సీ ఎస్టీ బీసీలు విశ్రాంత ఉద్యోగులకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం ఈ ప్లాంట్లకు నలభై వేల కోట్ల అప్పు ఎక్కడి నుంచి తెస్తోందని హరీశ్ రావు ప్రశ్నించారు. భూ కుంభకోణంపై సూటిగా సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీతులకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారీ పవర్ స్కాం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి