ఇక ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ పోతే మళ్లీ మామిడి పండ్లు దొరకవని జనాలు కూడా వీటిని ఎక్కువగా లాగించేస్తున్నారు. ఇక ఈ పండులో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి కూడా. ఈ సంగతి దాదాపుగా అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కానీ వీటి ఆకులు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి మాత్రం ఎక్కువగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఈ మామిడి ఆకుల్లో కూడా ఎన్నో ఔషద గుణాలుంటాయి. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలను ఈజీగా తగ్గిస్తాయి.ఇక మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్ ఎ, విటమిన్ బి ఇంకా అలాగే విటమిన్ సి అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రోగాలను కూడా ఈజీగా నయం చేస్తాయి.మధుమేహులకు మామిడి ఆకులు దివ్య ఔషదంతో సమానం అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఆకుల్లో ఉండే ఆంథోసైనిడిన్స్ అనే టానిన్లు డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచడానికి చాలా బాగా సహాయపడతాయి. ఇందుకోసం మామిడి ఆకులను బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకుని తీసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది.


అలాగే ఒక గిన్నెను తీసుకుని అందులో నీళ్లు పోసి కొన్ని మామిడి ఆకులను వేసి బాగా మరిగించి వాటిని పక్కకు పెట్టుకోవాలి. వాటర్ ను రాత్రంతా కూడా అలాగే ఉంచి.. ఉదయం పూట వడగట్టి పరగడుపున తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.మామిడి ఆకులు కిడ్నీల్లో ఉండే రాళ్లను తొలగించడానికి కూడా ఈజీగా సహాయపడతాయి. ఇక ఇందుకోసం..మామిడి ఆకుల పౌడర్ ను టీ స్పూన్ తీసుకుని వాటిని ఓ గ్లాస్ నీటిలో వేయాలి. దీన్ని రాత్రంతా కూడా అలాగే ఉంచి.. పొద్దున పూట పరగడుపున తాగాలి. తరచుగా ఇలా చేస్తే ఈజీగా రాళ్లు తొలగిపోతాయి.ఇంకా బీపీని తగ్గించడంలో కూడా మామిడి ఆకులు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.. ఇందుకోసం ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో మామిడి ఆకులను వేసి బాగా మరగబెట్టి వాటిని కాషాయంగా తాగాలి. ఇది హైబీపీ సమస్యని తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: