ఉదయం లేచిన మొదలు ప్రతి ఒక్కరు కూడా రాత్రి పడుకునే వరకు మొబైల్ ని కచ్చితంగా తమ వద్దని అంటిపెట్టుకొని ఉంటారు.. దీంతో ఫోన్ అలవాటుగా మారిపోయింది. తినడం లేదా పడుకోవడం వంటి సమయంలో కూడా తమ పక్కనే పెట్టుకోవాలని ఆలోచనతో ఉన్నారు. ముఖ్యంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ మొబైల్ ని ఉపయోగిస్తూ ఉన్నారు.. స్మార్ట్ మొబైల్ వల్ల మన జీవన విధానం కూడా ఎంత సౌకర్యంగా మారిందో అంతే నష్టం కూడా వాటిల్లుతోంది. అధిక సమయంలోనే తెలియకుండా ఎక్కువగా మొబైల్స్ వాడడం వల్ల చాలా జబ్బుల బారిన పడే అవకాశం ఉన్నది.


మొబైల్ విరామం లేకుండా వాడుతున్న వారికి.. మొబైల్ అడిక్షన్ అలవాటుగా పడిపోతారు.. మొబైల్ ఫోన్లకు పిల్లలే కాదు ఇంట్లోని పెద్దలు కూడా అతుక్కుపోయేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువసేపు మొబైల్ ని ఉపయోగించడం వల్ల గర్భాశయ సమస్యలు కూడా ఎదుర్కోవలసి ఉంటుందట.. ముఖ్యంగా మొబైల్ ని ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల గర్భాశయ ఎముకలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయనీ నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.



అలాగే భుజాలు, మెడ ,తలనొప్పి, వీపు దిగువ భాగమున ఎక్కువ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. గర్భాశయనొప్పి కూడా వస్తుందట.  విపరీతంగా ఎక్కువసేపు  కూర్చోవడం వల్ల చాలా ఇబ్బందులు అలాగే  లేవలేకపోవడం వంటి సమస్యలు కూడా ఉంటాయట. అందుకే నిపుణులు  సైతం గంటల తరబడి ఒకే చోట మొబైల్ ని చూస్తూ ఉండడం చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఫోన్ ని ఎక్కువగా మహిళలు ఉపయోగిస్తే.. సంతానం లేమి సమస్యలు కూడా ఎదురవుతాయట.. అలాగే చేతులలో నొప్పి , మెడ భాగంలో దిగుతుగా అనిపించడం తలనొప్పి రావడం భుజాలు నొప్పి వంటివి ఎదురవుతాయి. అందుకే మొబైల్ ని ఉపయోగించేటప్పుడు చాలా తక్కువగా ఉపయోగించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: