మొబైల్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలా ప్రమాదకరమైన అలవాటని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చాలామందికి ఉదయం నిద్ర లేవగానే మొబైల్ ని చూడడం ఒక అలవాటుగా ఉంటుంది.ఇలా చేయడం వల్ల మొబైల్ కు సంబంధించిన లైటింగ్ నేరుగా కలపైన పడి పలు రకాల కంటి సమస్యలకు దారి తిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక రాత్రి పడుకున్న తర్వాత ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరిచిన వెంటనే మొబైల్ ని చూస్తే మొబైల్ లైటింగ్ వల్ల కళ్ళు మందడం వంటివి జరుగుతాయి.
ఇలా రాను రాను కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఉదయం లేవగానే మొబైల్ ని ఎక్కువగా చూడడం వల్ల మెదడుపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇక అంతే కాకుండా ఏకాగ్రత తో పనిచేయడం వంటివి చేయవలసిన పనులను కూడా చేయలేరు. అందుచేతనే ఉదయం లేవగానే మొబైల్ ను చూసి అలవాటు ఉన్నవారు వెంటనే మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా సాధ్యమైనంతవరకు మొబైల్ కు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు తెలియజేస్తున్నారు.