మనం జ్వరం తగ్గడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో జ్వరం తగ్గిన తరువాత కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహార విషయంలో తగినంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. జ్వరం వల్ల శరీరం కోల్పోయిన పోషకాలను, శక్తిని తిరిగి శరీరానికి అందించడం చాలా అవసరం. జ్వరం తగ్గిన తరువాత త్వరగా జీర్ణమయ్యే ఆహారాలతో పాటు శక్తిని ఇచ్చే ఆహారాలను కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక జ్వరం తగ్గిన తరువాత కిచిడీని తీసుకోవాలి. ఎందుకంటే దీనిని తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అందడంతో పాటు త్వరగా జీర్ణమవుతుంది.ఇంకా అలాగే జ్వరం తగ్గిన తరువాత ఖచ్చితంగా పెరుగును తీసుకోవాలి.ఎందుకంటే ఇది జీర్ణశక్తిని పెంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇంకా అలాగే వెజిటేబుల్ దాలియాను కూడా తీసుకోవాలి. దీనిని తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమవ్వడంతో పాటు విటమిన్స్, మినరల్స్ కూడా మన శరీరానికి లభిస్తాయి. ఇక జ్వరం తగ్గిన తరువాత ఖచ్చితంగా దాల్ సూప్ ను తీసుకోవాలి.


ఎందుకంటే దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత బలం చేకూరుతుంది. ఇంకా అలాగే కొబ్బరి నీటిని తీసుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది.అలాగే జ్వరం తగ్గిన తరువాత ఖచ్చితంగా అరటిపండ్లను తీసుకోవాలి. ఇవి త్వరగా జీర్ణమవ్వడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. ఇంకా అలాగే జ్వరం తగ్గిన తరువాత యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే దానిమ్మ గింజలను తీసుకోవాలి.ఇంకా అలాగే యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు ఉండే అల్లంతో టీని తయారు చేసి తీసుకోవాలి. అలాగే వీటితో పాటు శరీరానికి పోషకాలు అందేలా, శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా వెజిటేబుల్ సూప్ ను తీసుకోవాలి. అలాగే జ్వరం తగ్గిన తరువాత ఆహారంలో భాగంగా కరివేపాకును కూడా తీసుకోవాలి.ఎందుకంటే వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. జ్వరం తగ్గిన తరువాత ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మనం మరింత త్వరగా కోలుకోవచ్చని అలాగే జ్వరం వల్ల శరీరం కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: