తెలుగు బిగ్ బాస్ సీజన్-3 కు ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. దీని సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ను నిర్వాహకులు త్వరలో ఇవ్వబోతున్నారు. ఫస్ట్ సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా సెకండ్ సీజన్ కు నాని హోస్టింగ్ చేశాడు. అయితే నానీ పట్ల అందరిలోను అసంతృప్తి ఉండటంతో ఈ సారి మూడవ సీజన్ కు వెంకటేష్, విజయ్ దేవరకొండ, రానా వంటి స్టార్స్ని పరిశీలించి చర్చించిన తర్వాత నాగార్జునాని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా ఆ విషయమై అధికారిక ప్రకటన రాలేదు. నాగార్జున 'మన్మధుడు 2' సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న నేపథ్యంలో ఆయనే మూడవ బిగ్ బాస్ అని దాదాపు అందరు ఫిక్సైయ్యారు.
ఇక ఈసారి పార్టిసిపెంట్స్ విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అంతేకాదు ఈసారి హౌస్ లో క్రేజ్ ఉన్న సెలబ్రెటీలను మాత్రమే తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే కొందరి పేర్లు కూడా ఫైనల్ అయ్యాయి. సోషల్ మీడియా సెన్షేషన్ వైవాహర్ష, ముగ్గురు నలుగురు గ్లామర్ డాల్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఉదయభాను ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. ఆమెతో పాటు పాపులర్ యాంకర్ శ్రీముఖి, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కూడా బిగ్ బాస్ 3 లో ఉండబోతున్నారట.
శ్రీముఖి ఇటీవల పటాస్ కు బ్రేక్ తీసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. దాంతో ఆమె బిగ్ బాస్ కోసమే పటాస్ కు బ్రేక్ తీసుకుందనే టాక్ వినిపిస్తుంది. ఇక బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కూడా ఆటతోనే కాకుండా గ్లామర్ తో కూడా స్టార్ డం దక్కించుకుంది. సినిమాల్లో కనిపించిన అనుభవం కూడా జ్వాలాకు ఉంది. అందుకే ఆమె కూడా తప్పకుండా బిగ్ బాస్ హౌస్ కు గ్లామర్ తీసుకు వస్తుందనే నమ్మకంతో నిర్వాహకులు ఉన్నారట. ఇక బిగ్ బాస్ 3 జులై లేదా ఆగస్టులో ప్రారంభం కానుందట.