మెగా హీరో రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీకి సంబందించిన పనుల్లో బిజిగా ఉన్నాయి. అయితే తను ఎక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాడు, ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుంది వంటి విషయాలను తెలుసుకోవటానికి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపుతున్నారు.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, రామ్చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్.ఎల్.పి పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం తాజా షెడ్యూల్ బుధవారం నుండి హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ మూవీ హీరోయిన్గా రకుల్ప్రీత్సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ
మూవీకి సంబంధించిన అప్ డేట్స్
వివరాలను మరింతగా తెలుసుకంటే,
గత నెల 21నుండి
30 వరకూ
రామ్చరణ్, రకుల్పై
యూరప్లో పాటల చిత్రీకరణ
చేశారు, హైదరాబాద్లో
మరో షెడ్యూల్ తాజాగా ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్లో
రామ్చరణ్తోపాటు కృతికర్బంధా,
తనికెళ్ల
భరణి, రావూ
రమేష్ వంటి యాక్టర్స్
పాల్గొంటారు. టాలెంటెడ్
టెక్నీషియన్స్ తో పనిచేస్తున్న
ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న
విడుదల చేయడానికి సన్నాహాలు
చేస్తున్నారు.