డార్లింగ్ ప్రభాస్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు, ఇలా బాహుబలి సినిమా తో ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం కూడా వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ అదే క్రేజ్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్, ఓం  రౌత్ దర్శకత్వంలో ఆది ఇది పురుష్, కేజిఎఫ్ పేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వీటితో పాటు నాగ అశ్విన్ దర్శకత్వం ఒక సినిమా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించేందుకు ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

 ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా పనులను చక చక పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది,  సలార్ సినిమాలో ప్రభాస్ హీరో కావడం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై జనాల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా జనాల్లో ఇప్పటికే ఫుల్ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సలార్ సినిమాలో ప్రభాస్ మీద ఒక ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించాలని చిత్ర బృందం ఆలోచనలో ఉందట, ఆ ప్రత్యేక గీతం కోసం ప్రభాస్ పక్కన కేజిఎఫ్ పేమ్ శ్రీనిధి శెట్టి ని మొదటగా ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ పై తెరకెక్కించే ప్రత్యేకగీతంలో సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: