అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం పుష్ప
సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా మొదటి భాగాన్ని దర్శకుడు సుకుమార్
క్రిస్మస్ సందర్భంగా
డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాలో
రష్మిక మందన
హీరోయిన్ గా నటిస్తుండగా
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ
సినిమా నుంచి రెండు పాటలు విడుదల అయ్యాయి.
రెండు పాటలతో సినిమాపై భారీ క్రేజ్ నెలకొనగా ఇప్పుడు కూడా మరో పాట విడుదల అవుతుండటం విశేషం.ఇవి ఈ
సినిమా పై క్రేజ్ మరింత పెరగడానికి కారణం అవుతుంది. మలయాళ స్టార్
హీరో ఫాహద్ ఫాజిక్ విలన్ గా ఈ సినిమాలో నటించబోతున్నాడు.
సునీల్ కూడా మరో కీలక మైన పాత్ర లో నటిస్తున్నాడు. అయితే
అల్లు అర్జున్ ఈ రెండు పార్ట్శ్ మధ్యలో ఉన్న గ్యాప్ ను కవర్ చేయడానికి
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే
సినిమా చేయాలని భావించాడు.
అయితే అనూహ్యంగా ఇప్పుడు
అల్లు అర్జున్ మాస్ దర్శకుడు
బోయపాటి శ్రీను తో
సినిమా చేయబోతున్నాడు అని వార్తలు రావడంతో ఈ ఐకాన్
సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు
వేణు శ్రీరామ్ అభిమానులు. వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న
వేణు శ్రీరామ్ తన తదుపరి చిత్రాన్ని ఐకాన్ చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు. కానీ అది ఏ హీరోతో అన్న విషయం మాత్రం చెప్పలేదు. అయితే
అల్లు అర్జున్ తన తదుపరి
సినిమా బోయపాటి శ్రీను తో చేయబోతున్నాడు అనే విషయం బయటకి రావడంతో ఈ సినిమాపై ఆయన ఇంట్రెస్ట్ లేదని చెప్పకనే చెబుతున్నాడు అని అనుకోవచ్చేమో. మరి పుష్ప
సినిమా తర్వాత
బోయపాటి శ్రీను తో చేస్తాడా మరి వేరే దర్శకుడు ఎవరైనా మధ్యలో వస్తాడా అనేది చూడాలి.