పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాధేశ్యామ్'. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు ముస్తాబవుతోంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతున్నా.. ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్ సోషల్ మీడియా వేదికగా రాధేశ్యామ్ చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాధేశ్యామ్ సినిమా నుంచి చిన్న అప్డేట్ అయినా ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు ఫాన్స్.

ఇక ఓ అభిమాని అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ ఇవ్వాలంటూ ఏకంగా సూసైడ్ నోట్ రాసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఎట్టకేలకు రాధేశ్యామ్ చిత్ర యూనిట్ దిగివచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ని ఈరోజు సాయంత్రం విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఫుల్ ఖుషీ అయ్యారు. రాధేశ్యామ్ ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ఫ్యాన్స్ కి మాత్రం మళ్లీ నిరాశే మిగిలింది. రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ప్రకటించిన సమయం ముగిసి గంట కావస్తున్నా ఫస్ట్ లిరికల్ సాంగ్ ని విడుదల చేయలేదు.

 అయితే ఎందుకు సరైన సమయానికి విడుదల చేయలేదు అనే విషయంపై కూడా చిత్ర యూనిట్ స్పందించలేదు. దీంతో డార్లింగ్ ఫాన్స్ రాదే శ్యామ్ మేకర్స్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిర్మాణ సంస్థతో పాటు డైరెక్టర్ నేను సైతం సోషల్ మీడియా వేదికగా బండ బూతులు తిట్టడం మొదలు పెట్టారు. నిద్రపోతున్నావా.. కారణం చెప్పు..? అంటూ రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. దీంతో రాధేశ్యామ్ చిత్ర పై ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో లో తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి కి రాధేశ్యామ్ నుంచి అప్డేట్ ఇస్తామంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆశ చూపిన యూవీ సంస్థ చివరి నిమిషంలో వారి ఆశలపై నీళ్లు చెల్లిందనే చెప్పాలి. ఇక తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: