మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిలిం 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించారు. జగపతిబాబు, పూర్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. సినిమాలో రెండు పాత్రల్లో బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి టేకింగ్ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్..

 ఈ సినిమాను ఘన విజయం సాధించడానికి కారణమయ్యాయని చెప్పాలి. అలాగే ఈ సినిమా విడుదలై 20 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికి చాలా చోట్ల సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. ఇక తాజాగా ఈ సినిమా మరో నయా రికార్డును సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ imdb లెక్కల ప్రకారం 2021 సంవత్సరానికి గాను భారతదేశపు అత్యుత్తమ చిత్రంగా నిలిచింది అఖండ.ఇది సినిమా పాన్ ఇండియా చిత్రం కానప్పటికీ దాదాపు 23 శాతం ఓట్లతో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక imdb వారు ఇండియా వైడ్ గా అత్యంత జనాదరణ పొందిన టాప్ 5 సినిమాల లిస్ట్ ని ప్రకటించారు. వాటిలో బాలయ్య అఖండ సినిమా టాప్ ప్లేస్ లో నిలువగా..

ఆ తర్వాత స్థానంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 16 శాతం ఓట్లు, వైష్ణవ తేజ్ ఉప్పెన 16 శాతం, నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు 12 శాతం, రవితేజ క్రాక్ 8% ఓట్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక అఖండ సినిమా సాధించిన ఈ అరుదైన ఘనతతో బాలయ్య ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతే కాదు జై బాలయ్య అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఫాన్స్ అందరు ట్రెండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు బాలయ్య తన తదుపరి చిత్రంగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: