నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చూపించిన ఈ సినిమా ఆయన కెరీర్ లోనే ఎప్పుడూ అందుకోని రికార్డులను అందుకని బాక్సాఫీసు వద్ద బిగ్ హిట్ చిత్రంగా నిలిచింది. బోయపాటి శ్రీను తో కలిసి నటసింహం చేసిన ఈ చిత్రం ఈ రేంజిలో విజయం సాధిస్తుంది అని ఎవరు అనుకోలేదు. వీరి కలయిక లో వచ్చే సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 

అయినా కూడా ఈ స్థాయి విజయం అనేది ఎవరు కూడా ఊహించలేదని చెప్పాలి. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం ఈ చిత్ర నిర్మాత అనే చెప్పాలి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించగా ఆయన నిర్మాతగా రెండవ చిత్రం గా తెరకెక్కిన ఈ చిత్రం తో ఆయన అగ్ర నిర్మాత గా ఎదిగారు అని చెప్పవచ్చు.  తాజాగా ఈ చిత్రం యొక్క విశేషాలు మీడియాతో పంచుకున్నారు రవీందర్ రెడ్డి.

తనకు అఖండ సినిమా సీక్వెల్ చేయాలని ఉందని తన మనసులో మాట చెప్పారు రవీందర్ రెడ్డి. ఇదే విషయాన్ని త్వరలో బోయపాటి శ్రీనుతో చర్చిస్తానని తప్పకుండా సినిమాకు సీక్వెల్ వచ్చేలా చూసుకుంటా అని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తుందని ఊహించలేదు అని మొదటి నుంచి గట్టి నమ్మకం ఈ సినిమాపై ఉందని ఆయన చెప్పారు. ఈ సినిమాలో బాలకృష్ణ అభిమానులకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఉన్నాయి అని చెప్పారు. అఖండ పాత్ర ఈ చిత్రానికి హైలెట్ అని అన్నారు. అయితే ఒకవేళ ఈ సినిమా వస్తే ఆ సీక్వెల్ సినిమాలో తాను భాగం అవుతానో లేదో తెలియదు కానీ వస్తే చాలా బాగుంటుంది అని చెప్పారు. హిందీలో రీమేక్ చేయాలని అనుకుంటే అజయ్ దేవగన్ లేదా అక్షయ్ కుమార్ అయితే ఈ పాత్ర కు  చాలా బాగుంటారని అని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: