బాలయ్య విషయానికి వస్తే.. అటు వెండి తెరపై ఇటు బుల్లితెరపై మంచి జోష్ లో ఉన్నారని తెలుస్తోంది. వెండితెరపై అఖండ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకోవడం.. బుల్లితెరపై ఆహా ఓటీటీ లో అన్ స్టాపబుల్ షో తో నుంచి టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకోవడం అన్నీ కూడా బాలయ్యకు బాగా కలిసి వచ్చాయి అని చెప్పవచ్చు.. అల్లు అరవింద్ ఏర్పాటుచేసిన ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో తాజాగా ఇండియా లో ప్రసారమవుతున్న షో లలో టాప్ 10 లో 5 వ ర్యాంకు సాధించడం గమనార్హం.
ఇదిలా ఉండగా సంక్రాంతి కానుక కు బాలయ్యతో కలిసి లైగర్ చిత్రం యూనిట్ సభ్యులు సందడి చేయనున్న ట్లు తెలుస్తోంది. తాజాగా ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఒక ఫోటోలో బాలయ్య బాబు , చార్మి ,విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇక ఈ షోను సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14 వ తేదీన ఆహా లో టెలికాస్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే బాలయ్యతో మోహన్ బాబు, రవితేజ , బ్రహ్మానందం ,అల్లు అర్జున్ , రాజమౌళి వంటి ప్రముఖులు వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే అంతేకాదు అఖండ సినిమా యూనిట్ కూడా ఈ షో లో మెరిశారు. ఇక బాలయ్య తో లైగర్ చిత్రం యూనిట్ ఎలా సందడి చేయబోతోందో తెలియాలంటే పండుగ వరకూ ఎదురుచూడక తప్పదు.