విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ సినిమాతో డైరెక్టర్ పరశురామ్ కి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. పరశురాం - మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా మహేష్ బాబు కి కరోనా సోకడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందా?లేదా? అనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమాతో దర్శకుడు పరశురామ్ హ్యాట్రిక్ సాధించాలని ఆశిస్తున్నారు. అయితే ఈ దర్శకుడి తర్వాత సినిమాకి సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాలు తెగ వైరల్ అవుతుంది.

దాని ప్రకారం ముగ్గురు స్టార్ హీరోలతో ఓ మల్టీ స్టారర్ సినిమాని తెరకెక్కించేందుకు దర్శకుడు పరశురాం స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇక సర్కారు వారి పాట సినిమా సక్సెస్ సాధిస్తే ఈ మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపే అవకాశాలున్నాయి. అంతే కాదు పాన్ ఇండియా రేంజ్ లో పరశురామ్ ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ సినిమాలకు క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పరశురాం ఇప్పుడు ముగ్గురు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం ఆసక్తిని పెంచుతోంది.

 త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సర్కారు వారి పాట సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 1 న ఈ విడుదల కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా  70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే తమన్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక ఆ ఫస్ట్ సింగిల్ కోసం మహేష్ బాబు ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: