కన్నడ భామ రష్మిక మందన్న సడెన్ గా ముంబైలో కరణ్ జోహార్ ఆఫీస్ లో దర్శనమిచ్చింది. ఆల్రెడీ సౌత్ లో సూపర్ స్టార్డం తెచ్చుకున్న ఈ అమ్మడు నార్త్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే రెండు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులను చేస్తున్న రష్మిక మందన్న ఇప్పుడు కొత్తగా మరో ఆఫర్ కోసం ముంబై వెళ్లినట్టు టాక్. సౌత్ సినిమాలతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న రష్మిక లేటెస్ట్ గా పుష్ప సినిమా తో హిందీ ఆడియెన్స్ ని కూడా మెప్పించింది.

కరణ్ జోహార్ నెక్స్ట్ చేసే సినిమా లో హీరోయిన్ గా రష్మికని తీసుకునే ఆలోచన తో ఆమెని ముంబైకి పిలిచినట్టు తెలుస్తుంది. కరణ్ జోహార్ కు రష్మిక పేరుని సజెస్ట్ చేసింది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అని అంటున్నారు. ఆల్రెడీ కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ లో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కరణ్ జోహార్ కి బాగా క్లోజ్ అయ్యాడట విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో తన బెస్ట్ ఫ్రెండ్ రష్మికకి హిందీ లో ఆఫర్లు వచ్చేలా చేస్తున్నాడట.

విజయ్ రిఫర్ చేశాడని కాదు రష్మిక టాలెంట్ గుర్తించి కూడా కరణ్ సినిమాలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ క్రేజీ ఫిల్మ్ మేకర్ అయిన కరణ్ జోహార్ ఇప్పుడు సౌత్ స్టార్స్ మీద.. సౌత్ సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అందుకే ఇక్కడ నుండి ఎవరు వచ్చినా ముందు తన తోనే డీల్ సెట్ చేసుకునేలా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ కూడా లైగర్ తర్వాత కరణ్ జోహార్ తో డైరెక్ట్ హిందీ సినిమా ఒకటి ఫిక్స్ చేసుకున్నట్టు టాక్. అదే జరిగితే విజయ్ నటించే సినిమాలోనే రష్మిక హీరోయిన్ గా చేస్తుందని టాక్.

 


మరింత సమాచారం తెలుసుకోండి: