నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే పోయిన సంవత్సరం టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన తెరకెక్కిన అఖండ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు, ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించగా పూర్ణ మరో ముఖ్యమైన పాత్రలో నటించింది,  ఈ సినిమాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా కలెక్షన్ లను కూడా బాగానే రాబట్టింది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ 'అఖండ'  లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు, ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది, అలాగే ఈ సినిమాలో విలన్ గా దునియా విజయ్ కనిపించబోతుండగా మరో ముఖ్యమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటించబోతోంది.

ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఒక పాత్రలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్టు గా కనిపించనుండగా మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, ఈ సినిమాలో దర్శకుడు గోపీచంద్ మలినేని ఫ్యామిలీ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చి దిదబోతునట్లు తెలుస్తోంది, బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న  సినిమా తర్వాత  అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు.  అయితే తాజాగా బాలకృష్ణ కు శ్రీకాంత్ అడ్డాల ఒక కథను వినిపించగా ఆ కథ బాగా నచ్చిన బాలకృష్ణ ఈ దర్శకుడితో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి, అలాగే బాలకృష్ణ, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకర్కబోయే సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి, ఇది ఇలా ఉంటే ఈ వార్త పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: