పుష్ప సినిమా మంచి సక్సెస్ కావడంతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు అల్లు అర్జున్... ఆయన స్నేహితుడు అయిన ప్రముఖ డైరెక్టర్ మారుతి డైరెక్ట్ గా అల్లు అర్జున్ ని కలిసి తన ట్విట్టర్ ద్వారా పుష్ప సినిమా గురించి తెలియజేయడం జరిగింది.. ఇక డైరెక్టర్ మారుతి అల్లు అర్జున్ మంచి స్నేహితులు అన్న సంగతి మనకు ఇదివరకే తెలిసిందే. అయితే తన ట్విట్టర్ ద్వారా ఏం సందేశాన్ని ఇచ్చాడో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


తన ప్రియమైన మిత్రుడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే వంద కోట్ల రూపాయల మార్క్ ను అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. పుష్ప లో తన పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ కి ఈసారి ఎన్నో అవార్డులు కొల్లగొట్టాలని ఆశిస్తున్నాను.. తన హార్డ్ వర్క్ తో  తన అభిమానులను ఎంతగానో సంతోష పరుస్తున్నారు అల్లు అర్జున్.. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో సాధించి.. అందరిని గర్వపడేలా చేస్తారని ట్విట్టర్లో తెలియజేశాడు డైరెక్టర్ మారుతి. ఇక డైరెక్టర్ మారుతి తను సినీ ఇండస్ట్రీకి రాకముందే అల్లు అర్జున్ కి మంచి స్నేహితుడు. కానీ వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ విషయంపై  మీడియా సంస్థలు ఎన్నోసార్లు డైరెక్టర్ మారుతి ప్రశ్నించాయి.


ప్రస్తుతం డైరెక్టర్ మారుతి గోపీచంద్ తో కలిసి పక్కా కమర్షియల్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా ఈ ఏడాది మే నెలలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా డీలక్స్ అనే ఒక మూవీ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై ఇప్పటివరకు ఏ విధంగా కూడా సమాచారం అందించలేదు డైరెక్టర్ మారుతి. ఇక పూర్తిగా కామెడీ సబ్జెక్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు అనే వార్త బయటకు రావడంతో.. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈసారైనా అల్లు అర్జున్ తో సినిమా తీస్తాడు ఏమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: