డైరెక్టర్ బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్లో అఖండ మంచి విజయాన్ని అందుకుంది..ఈ సినిమా 100 కు పైగా థియేటర్లలో 50 రోజుల ను పూర్తి చేసుకోవడం గమనార్హం. ఇక ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 2న విడుదల కాగా.. ఈ ఏడాది జనవరి వరకు హౌస్ ఫుల్ బోర్డ్ తో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రభంజనాన్ని ఏ హీరో సృష్టించ లేదని చెప్పవచ్చు. అయితే దీంతో ఈ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతోంది అనే వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎవరు ప్రకటించలేదు.


అయితే డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం తన తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో చేయాలనుకున్నాడు.. అందుకు సంబంధించిన కథను కూడా ప్రస్తుతం చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నే నిర్మించాలని అల్లుఅరవింద్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పుష్ప సినిమా సీక్వెల్ లో అల్లు అర్జున్ నటిస్తుండడంతో బోయపాటి సినిమా కాస్త ఆలస్యం కానున్నట్లు గా తెలుస్తోంది.. దీంతో మరో హీరోతో మరొక ప్రాజెక్ట్ ను సెట్ చేయబోతున్నాడు అనే వార్త వినిపిస్తోంది.

అసలు విషయంలోకి వెళితే ఎప్పుడు హీరోలంతా ఎవరు ప్రాజెక్టు పనుల్లో వారు చాలా బిజీగా ఉన్నారు.. ఇక హీరో రామ్ తను నటిస్తున్న "ది వారియర్"మూవీ మాత్రం షూటింగ్ చివరి దశలో చేరుకున్నది.. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రామ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే రామ్ బోయపాటి శ్రీను తో ఒక సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. దీంతో బోయపాటి హీరో రామ్ కు కథ వినిపించినట్లుగా తెలుస్తోంది.. ఆ కథను రామ్ ఓకే చేసినట్లుగా బాగా టాక్ వినిపిస్తోంది ఇక ఇది కూడా ఒక మాస్ సినిమానే అన్నట్లుగా భావిస్తున్నారు ఆయన అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: