ఇక ఈ సినిమాని తమిళంలో కూడా..ఎథరక్కుమ్ తునిన్దవన్ అనే పేరుతో తమిళంలో విడుదల అవుతోంది. ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రఫీ గా పనిచేశారు. ఇందులో కథానాయకిగా ప్రియాంక మోహన్ నటిస్తోంది.. ఈ సినిమా ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేశారు చిత్ర బృందం. ఇక ఈ సినిమాని పాండీరాజ్.. ఇలాంటి అవార్డుల రేంజ్ కలిగిన దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు. అందుచేతనే ఈ సినిమాకి అంత బజ్ ఉందని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమా టీజర్ ని దగ్గుపాటి రానా తెలుగులో విడుదల చేయడం జరిగింది. ఈ ఒక్క నిమిషం నిడివి గల టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.
ఈ సినిమా మార్చి 10వ తేదీన అన్ని భాషలలో ఒకేసారి విడుదల అవుతోందని టీజర్లో తెలపడం జరిగింది. టీజర్ ని బట్టి చూస్తే ఈ సినిమా మరొక యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించబడినట్లుగా కనిపిస్తోంది. సూర్య ఈ సినిమాలో లుంగీ కట్టు తో అదరగొట్టేశాడు అని చెప్పవచ్చు. సింగం సినిమా తరువాత మరొకసారి అలాంటి యాక్షన్ సినిమా తో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సూర్య. ఇక సూర్య చివర్లో చెప్పే డైలాగ్ సినిమా టీజర్ ని ఆకట్టుకునేలా కనిపిస్తోంది.