సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. ఆయనకు సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా రాజకీయాలలో అలాగే దేశవ్యాప్తంగా ఉన్న బడా వ్యాపారుల దగ్గర కూడా మంచి గౌరవం ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు విద్యానికేతన్ వంటి యూనివర్సిటీలను నడుపుతూ ఎంతోమంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ వారికంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని సూచిస్తున్నారు. ఇకపోతే కమెడియన్ ఆలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అంతే కాదు ఆలీకి మోహన్ బాబు కి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పవచ్చు.

ఎందుకంటే వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలో ఎంత మంచి స్నేహితులు గా ఉంటారో ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఇక  అలాంటిది మోహన్ బాబు ఆలీ  పై తాజాగా కామన్ సెన్స్ ఉందా అంటూ విరుచుకుపడ్డారు. ఇందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం. సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక  వేదికపై మోహన్ బాబు, నరేష్ ,ఆలీ తో పాటు మరి కొంత మంది స్టేజ్ ను అలంకరించడం జరిగింది. ఇక ఈ స్టేజి పైన మోహన్ బాబు కొంచెం స్పీచ్ ఇస్తూ ఉండగా అది వినకుండా స్టేజ్ పైన అలీ మొబైల్ చూసుకుంటూ ఉండిపోయాడు.

ఒకపక్క స్పీచ్ ఇస్తూ ఈ విషయాన్ని గమనించిన మోహన్ బాబు వెంటనే ఆలీ ఫోన్ చూస్తున్నావా..?  కామన్ సెన్స్ గనుక ఉంటుందా..? వేదిక మీదకు వచ్చి ఫోన్ మాట్లాడితే ఇక మేమంతా ఏంటయ్యా..? తప్పుకోవయ్యా.. అంటూ  నరేష్ ను పక్కకు తోశారు.. ఇక అక్కడ ఆలీ నవ్వుతూ షర్ట్ బటన్స్ విప్పుతూ.. నవ్వడంతో మోహన్ బాబు వెంటనే జోక్ కాదు ఫోన్ మాట్లాడుతున్నావ్ ఏంటి.. వేదిక కదా.. తమ్ముడు చెప్పు అంటూ విరుచుకు పడ్డాడు.. అలీ భార్య ఫోన్ చేసింది అంటూ చెప్పడంతో ఇక మాకు ఎవరికీ పెళ్ళాలు లేరురా.. నీకు ఒక్కడికేనా .. రాత్రులు తిరుగుతావు కాబట్టి ఎక్కడున్నావ్ అని మీ భార్య ఫోన్ చేసి ఉంటుంది.. నీమీద ఆమెకు అనుమానం కాబట్టే ఫోన్ చేసింది.. ఫంక్షన్ లో ఉన్నావా లేక బయట ఎక్కడైనా తిరుగుతున్నావా .. మరి మాకు చేయరే..మా భార్యలు ఫోను అంటూ అలా సరదాగా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: