కోలీవుడ్ , టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సిద్ధార్థ్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  సిద్ధార్థ్ పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్ సినిమాతో హీరోగా సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  బాయ్స్ సినిమా మంచి విజయం సాధించడంతో సిద్ధార్థ్ కి అటు కోలీవుడ్ ఇండస్ట్రీ లోనూ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది.

అలా బాయ్స్ సినిమా  ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న సిద్ధార్థ్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా క్రేజీ సినిమాల అవకాశాలు కూడా దక్కాయి.  అందులో భాగంగా సిద్ధార్థ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలలో నటించాడు.  అందులో భాగంగా సిద్ధార్థ్ నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి మూవీ లు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. కాకపోతే ఆ సినిమాల తర్వాత సిద్ధార్థ నటించిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. 

అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస పరాజయాలను ఎదుర్కొన్న సిద్ధార్థ్ తాజాగా మహా సముద్రం మూవీ లో హీరోగా నటించాడు.  ప్రస్తుతం సిద్ధార్థ్ 'ఎస్కేప్ లైవ్' అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ మే 20 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ గా ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా సిద్ధార్థ్ కొన్ని ఆసక్తి కరమైన కామెంట్లు చేశాడు. ఆసక్తికరమైన పాత్రల్లో నటించే అవకాశం వచ్చినంత వరకూ మూవీ లలో తను నటిస్తానని, ఒక వేళ అటువంటి అవకాశాలు రానప్పుడు వేరే ఉద్యోగం వెతుక్కుంటాన‌ని సినీ హీరో సిద్ధార్థ్ తాజాగా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: