యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తాజాగా 'విక్రమ్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ కొన్నేళ్లుగా వెండితెరపై కనిపించకపోయినా.. వరుస ఫ్లాప్ సినిమాలో నటిస్తూ వస్తున్నా కూడా ఇవేమీ పట్టించుకోకుండా తమిళ కుర్ర దర్శకుడు లోకేష్ కనకరాజు కమల్ హాసన్తో విక్రమ్ సినిమాని తెరకెక్కించాడు. ఇక దర్శకుడు మొదటినుంచి కమల్ హాసన్ కి వీరాభిమాని కావడంతో ఆ అభిమానం ఈ మొత్తం ఈ విక్రమ్ సినిమాలో చూపించేశాడు. ఇక కమల్ హాసన్ తో పాటు సౌత్ స్టార్స్ అయిన ఫాహద్ పజిల్, విజయ్ సేతుపతి, సూర్య లాంటి అగ్ర హీరోల ను తీసుకొని ఎక్కడ కూడా ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువగా కాకుండా అందరిని బ్యాలెన్స్ చేస్తూ లోకేష్ కనగరాజ్ సినిమా తీసిన...

 విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ మరో సారి తన విశ్వరూపాన్ని చూపించేశాడు. దీంతో ఈ సినిమా విడుదలైన కేవలం మూడు రోజులకే వంద కోట్ల క్లబ్లో చేరి పోయింది. ఇక ఇంత పెద్ద విజయం అందించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి కమలహాసన్ ఒక ఖరీదైన బహుమతి అందించాడు. ఇక తనకు చాలా కాలం తర్వాత హిట్టు వచ్చినా సందర్భంగా కమల్ హాసన్ లోకేష్ కనగరాజ్ కి ఒక అదిరిపోయే ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు. ఇక వీటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక లోకేష్ కనకరాజు బహూకరించిన కారు విలువ సుమారు 2.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక ఈ కారుతో పాటు ఒక ఎమోషనల్ లెటర్ ని కూడా లోకేష్...

 కనగరాజ్ కి అందజేశాడు కమలహాసన్. ఇక ఆ లెటర్ ను లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడం జరిగింది.' లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ లెటర్.. ఈ లెటర్ చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్స్ ను చెప్పడానికి మాటలు రావడం లేదు.. ధన్యవాదాలు కమల్ హాసన్ సర్' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఆ లెటర్ అందుకు సంబంధించిన ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక విక్రమ్ సినిమాతో భారీ హిట్ ను అందుకున్న లోకేష్ కనకరాజు తన తదుపరి చిత్రాన్ని ఇళయదళపతి విజయ్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: