తొలి సినిమా చేసిన తర్వాత శ్రీకాంత్ అడ్డాల తొలి టాలీవుడ్ మల్టీ స్టారర్ సినిమా చేయడం విశేషం. ఈ మల్టీ స్టార ర్ లో వెంకటేష్ మరియు మహేష్ బాబు లు హీరోలుగా నటించగా ఈ సినిమా ఫామిలీ ప్రేక్షకులను ఎంతో అలరించింది. ఆ సినిమా తర్వాత ఆయనకు తిరుగు లేదని అనుకున్నారు అయితే అందరిలో ఆ అభిప్రాయం మారడానికి పెద్ద సమయం పట్టలేదు. బ్రహ్మోత్సవం సినిమా ఆయన ఆశలను తుడిచిపెట్టేసింది. ఆ ఫ్లాప్ తాలూకు ప్రభావం మొత్తం ఆయనపైనే పడింది.
మళ్ళీ ఆయన సినిమా చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. పోయిన ఏడాది వెంకటేష్ నటించిన నారప్ప సినిమా తో ఆయన మళ్ళీ మెగా ఫోన్ పట్టుకుని అదృష్టాన్ని పరీక్షించుకున్న్నారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది కానీ రీమేక్ సినిమా అవడంతో శ్రీకాంత్ అడ్డాల కు పెద్దగా పేరు రాలేదు. దర్శకత్వానికి పర్వాలేదనిపించుకునే మార్కులు పడ్డాయి. అయితే ఆయనకు హిట్ వచ్చినా కూడా హీరోలు ఎవరు నమ్మకపోవడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఆయన కు సినిమాలు ఇవ్వడం లో ఎందుకు ఆలస్యం చేస్తున్నారో కానీ ఆయన అభిమానులు మాత్రం ఎంతో కృంగిపోతున్నారు. రచయితగా కూడా ఆయన మంచి పేరు కలిగిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఏ హీరో అవకాశం ఇస్తాడో చూడాలి.