తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ మరియు ప్రభాస్ సరసన నటించిన ముద్దుగుమ్మ దీక్షాసేత్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.దీక్షాసేత్ 2009వ సంవత్సరంలో ఫెమినా అందాల పోటీలలో ఫైనల్ లిస్టులో నిలబడిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.ఈమె కొన్ని చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది.అయితే ఈమె మొదటగా మిరపకాయ సినిమాతో రవితేజతో కలిసి నటించిన దీక్షాసేథ్ అల్లు అర్జున్తో వేదం చిత్రంలో నటించింది. ఇక ఆ తరువాత ప్రభాస్ జోడీగా రెబల్ సినిమాలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

దీక్షా  ఇలా తన అందం అభినయం విషయంలో ఎక్కడా కూడా ఈ హీరోయిన్ కి ఏ హీరోయిన్ సాటి రాదు అని చెప్పవచ్చు. కాగా ఈమె తన  నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.అయినప్పటికీ ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలలో కనిపించి ప్రేక్షకులను బాగా అలరించింది.కాగా  ఆ తర్వాత ఈమె  కనిపించకుండా పోయింది దీంతో ఇమే కు ఏమైంది అన్న చర్చ ఇప్పుడు బాగా వైరల్ గా మారుతోంది.తాజాగా ఇప్పుడు ఈమె గురించి ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే తెలుగులో సరిగ్గా అవకాశాలేమి రాకపోవడంతో ఇమే బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లినట్లు సమాచారం. 

అంతేకాదు మొదటిసారిగా 2014వ సంవత్సరంలో లేకర్ హమ్ దివానా దిల్ అనే చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక  ఆ తరువాత వచ్చిన జగ్గు దాదా సినిమాతో కన్నడ ఇండస్ట్రీ లో కూడా అడుగుపెట్టింది. అయితే ఇదే సంవత్సరం హిందీలో కూడా మరొక సినిమాలో చేసింది.ఇకపోతే దీక్షాసేథ్ చివరి చిత్రం ఇదే కావడం కూడా గమనార్హం .ఇక ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమైంది.  ప్రస్తుతం ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఎక్కడ ఉంది ఏమైంది అనే విషయం ఇప్పటివరకు తెలియలేదు.అయితే ఆ సినిమా కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో కూడా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: