ఇటీవల మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి
సక్సెస్ అందుకున్నాడు అడవి శేష్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా
సినిమా పరిశ్రమలోకి వచ్చి చిన్న హీరోగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి ఇప్పుడు ఇంతటి స్థాయి కలిగిన హీరోగా ఎదిగాడు. క్షణం
సినిమా విజయం సాధించడం ఆయన కెరీర్ ను పూర్తిగా
మార్చి వేసింది అని చెప్పాలి. ఆ
సినిమా తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. అలాంటి క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తూ అడవి శేషు వరుస విజయాలు సాధిస్తూ ప్రేక్షకులలో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.
అలా ఈనెల మేజర్
సందీప్ ఉన్నికృష్ణన్
జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ
సినిమా ద్వారా ఆయనకు కలిగిన ఆయన తదుపరి వచ్చే
సినిమా పై అంచనాలు పెరిగేలా చేసింది
నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న హిట్ 2
సినిమా తో ఆయన త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. శైలేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన హిట్
సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఈ రెండవ భాగం సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ
సినిమా లో తప్పకుండా ప్రేక్షకులందరూ అబ్బుర పడే ఎన్నో అంశాలు ఉన్నాయని చిత్రబృందం చెబుతోంది. మిస్టరీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ చిత్రం ద్వారా మరొకసారి క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అని చెబుతున్నారు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల కాబోతుంది ఈ దర్శకుడు ఇప్పుడు తాను దర్శకత్వం వహించిన తొలి భాగం హిట్ ను
బాలీవుడ్ లో తెరకెక్కించాడు. అక్కడ కూడా ఈ
సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఆ రిజల్ట్ ని బట్టి ఈ చిత్రం కూడా బాలీవుడ్లో కూడా ఈ
సినిమా చేస్తారట.