పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే తాజాగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా డార్లింగ్ ఫ్యాన్స్ ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.ఇక దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఆయన నటిస్తున్న సలార్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొతే పాన్ ఇండియా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇదిలావుండగా  కేజీఎఫ్ 2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. 

యంగ్ రెబల్ స్టార్‏ను ఏ రెంజ్‏లో చూపిస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే సాహూ సినిమా తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్ అంటూ కూల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రభాస్. ఇక మామూలుగానే ప్రభాస్ సినిమా అంటే భారీ యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఎక్స్పెట్ చేస్తారు ఫ్యాన్స్. అంతేకాదు రాధేశ్యామ్ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేక పోవడం కనీసం పవర్ ఫుల్ డైలాగ్ కూడా వినిపించకోపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒకింత నిరాశ పడ్డారు.కాగా ఆలోటును.. డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలిని ప్రశాంత్ నీల్ తీరచబోతున్నాడట. ఇకపోతే సాలార్ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని అంశాలను. అయితే డార్లింగ్ నుంచి ఎక్స్పెట్ చేస్తునందానికి పదింతలు ఇచ్ఛేలా ప్లాన్ చేస్తున్నాడట.

ముఖ్యంగా ప్రభాస్ ఎలివేషన్ సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. ఇదిలావుంటే ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, చేజింగ్స్ తో పాటు అదిరిపోయే ట్విస్ట్ లు కూడా ఉండనున్నాయట. అయితే మొత్తంగా ప్రభాస్ ను మునుపెన్నడూ చూడని విధంగా చూపిస్తానంటున్నాడు ప్రశాంత్ నీల్.కాగా  ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే.ఇదిలావుంటే  ప్రభాస్ ఎంట్రీ భారీ గా ఉంటుందని, ఇందుకోసం దాదాపు 25 కోట్లు ఖర్చు చేస్తున్నారని టాక్. ఇది ఒక్కటే కాకుండా ప్రతి యాక్షన్ సీన్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించేలా ఉండేలా చూసుకుంటున్నారట ప్రశాంత్ నీల్. ఇక ఈసారి సలార్ దెబ్బకు థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది.చూడాలి మరి ఏం అవుతుందో...!!!

మరింత సమాచారం తెలుసుకోండి: