మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఒక మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 154 వ మూవీ గా తెరకెక్కుతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటించబోతున్న విషయం  మనందరికీ తెలిసిందే.

తాజాగా ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ధ్రువీకరించిన విషయం కూడా మనకు తెలిసిందే. అందులో భాగంగా చిత్ర బృందం ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఆ వీడియోలో రవితేజ, మెగాస్టార్ చిరంజీవి  మూవీ లో జాయిన్ అయినట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఇది ఇలా ఉంటే ఈ  మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతోంది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో రవితేజ జాయిన్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మొదట చిత్ర బృందం చిరంజీవి మరియు రవితేజ పై ఒక సాంగ్ ని చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. 

ఆ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కాగానే జులై 18 వ తేదీ నుండి ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని కూడా చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుండగా, ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ కోసం దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మాస్ ట్యూన్ కను ఇప్పటికే కంపోజ్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: