ప్రస్తుతం  హీరోయిన్స్ కూడా రెమ్యునరేషన్స్ ఒక్క సారిగా పెంచేస్తున్నారు. ఇక ఒకప్పుడు రెండు మూడు సినిమాలు సక్సెస్ అయితే గానే మరో సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ పెంచేవారు కాదు.అయితే ఇప్పుడు మాత్రం ఒక్క సినిమా హైప్ క్రియేట్ చేసే క్రమంలోనే ముందస్తుగానే అత్యధిక పారితోషికాన్ని డిమాండ్ చేస్తూ ఉండడం విశేషం. ఇదిలావుంటే నయనతార కూడా గత కొంతకాలంగా తన పారితోషికాన్ని మెల్లగా పెంచుకుంటూ వెళుతుంది.ఇకపోతే ఇటీవలనే తన 75వ సినిమాకు మాత్రం ఊహించిన విధంగా రేటును ఒక్కసారి డబుల్ చేసేసినట్లుగా తెలుస్తోంది. 

ఇక మొన్నటి వరకు ఏ భాషలో సినిమా చేసినా కూడా నయనతార ఐదు కోట్ల పారితోషికాన్ని అందుకుంటూ వచ్చింది. ఇకపోతే.  ఆమె త్వరలోనే తన 75వ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరపైకి తీసుకురానుంది.కాగా శంకర్ శిష్యుడు నీలేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు జీ స్టూడియోస్ ఈ ప్రతిష్టాత్మక నిర్మించనున్నాయి.ఇదిలావుంటే ఈ ప్రాజెక్టు కోసం నయనతార ఏకంగా 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఈ తరహాలో రెమ్యూనరేషన్ అందుకున్నది లేదు. 

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ప్రస్తుతం కొంతమంది అంతకుమించి ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు.తాజాగా ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతార ఒకేసారి 10 కోట్లు అడగడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.అయితే  ఒక విధంగా నిర్మాతలు కూడా ఆ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఈ బ్యూటీకి అడిగినంత వారితోషికం ఇస్తున్నట్లు సమాచారం.అంతేకాకుండా  అలాగే నయనతార మరోవైపు బాలీవుడ్ లో కూడా షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్లో రానున్న జవాన్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.పెళ్లి తర్వాత ఇటీవలే జవాన్ సినిమా షూటింగ్లో జాయిన్ అయింది నయనతార. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో తమిళ అగ్ర హీరో ఇళయదళపతి విజయ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు విజయ్ ఈ పాత్ర కోసం ఎటువంటి పారితోషకం తీసుకోకుండా నటిస్తున్నాడని సమాచారం..!!..!!

మరింత సమాచారం తెలుసుకోండి: