టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న యంగ్ దర్శకులలో ఒకరు అయినా వేణు ఉడుగుల గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . దర్శకుడు వేణు ఉడుగుల,  శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన నీది నాది ఒకే కథ మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు . మొదటి సినిమాలోనే తాను ఎంచుకున్న కథ, ఆ కథను తెరకెక్కించిన విధానానికి దర్శకుడు వేణు ఉడుగుల కు ప్రేక్షకుల నుండి , ప్రశంసలను అదిరిపోయే ప్రశంసలు దక్కాయి .

అలాగే ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది . మొదటి మూవీ తోనే దర్శకుడు వేణు ఉడుగుల కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ లభించింది . అలా నీది నాది ఒకే కథ మూవీ తో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రియేట్ చేసుకున్న ఈ దర్శకుడు తాజాగా విరాట పర్వం సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో దగ్గుబాటి రానా హీరోగా నటించగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. కొన్ని రోజుల క్రితమే  ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ విజయాన్ని అందుకోలేక పోయినప్పటికీ ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను మాత్రం అందుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు వేణు ఉడుగుల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో వేణు ఉడుగుల మాట్లాడుతూ... తన నెక్స్ట్ మూవీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని , కథ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని ఈ దర్శకుడు తాజా ఇంటర్వ్యూ లో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: