ప్రభాస్ హీరోగా ఇప్పుడు రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమ వుతున్నాయి. చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో అన్న ఆసక్తి ప్రేక్షకుల లో నెలకొంది. వాస్తవానికి ఈ ఏడాది ప్రభాస్ ఒక్క రాధే శ్యామ్ సినిమా తోనే ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత ఏ సినిమా కూడా ఈ ఏడాది విడుదల అయ్యే విధంగా సిద్ధంగా లేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మాత్రం బాలీవుడ్ సినిమా ఆది పురుష్ విడుదల అవుతుంది అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధిం చి ఒక్క అప్డేట్ కూడా రాకపోవడం ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆగ్రహ పరుస్తుంది. గతంలో వారు ఓ నిర్మాణ సంస్థపై త్రోలింగ్ చేసి ప్రభాస్ సినిమాకు సంబంధించిన అప్డేట్లను రాబట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే చేయవలసి వస్తుందా అని ఆలోచనలు చేస్తు న్నారు. బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ఆది పురుష్ చిత్రం తప్పకుం డా భారీ విజయాన్ని అందుకుంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కూడా ఇది ఎంతగానో అవసరమైన విజయం. సంక్రాంతి సీజన్ కు రావడంతో ఈ సినిమా తప్పకుండా మం చి కలెక్షలను సాధిస్తుందని అంద రూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా యొక్క అప్డేట్లను విడుదల చేసి క్రేజ్ ను మరింతగా పెంచవలసిందిగా ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. లే కపోతే ప్రభాస్ నటిస్తున్న మరొక సినిమా యొక్క షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసిం ది. ఆ విధంగా వచ్చే ఏడాది రెండు భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ ప్రేక్షకులను అలరించనున్నాడు. మరి ఆయా సినిమాలు ప్రేక్షకులను ఏ స్థాయి లో ఆకట్టుకుంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: