రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ ఈ సంవత్సరం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన రాధే శ్యామ్ మూవీ ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది. రాధే శ్యామ్ మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ప్రభాస్ ప్రస్తుతం వరస మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.
\
మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , దీపికా పదుకొనే ఈ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , బిగ్ బి అమితా బచ్చన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కొన్ని షెడ్యూల్ ల షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ కే మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ ఈ వారం నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' మూవీ తో పాటు సలార్ మూవీ లో కూడా నటిస్తూ వస్తున్నాడు. సలార్ మూవీ కి 'కే జి ఎఫ్' మూవీ దర్శకుడు అయినటు వంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే మరియు సలార్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: