సినిమాల ఫలితం ఎలా ఉన్నా కూడా మెగాస్టార్ చిరంజీవి మాత్రం వరుసగా సినిమాలను చేస్తూ ఫుల్ బిజీ బిజీగా దూసుకుపోతున్నాడు. ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'ఆచార్య' సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ఊహించని విధంగా భారీ ఫ్లాప్‌ను అందుకున్నాడు.ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో చిరు తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’ ఒకటి. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఈ చిత్రంలో విక్టరి వెంకటేష్ కూడా భాగం కానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో వెంకీమామ గెస్ట్ రోల్ ప్లే చేయనున్నాడట.


చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతో అడగ్గానే ఒకే చెప్పాడట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుందట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త తెలిసినప్పటి నుండి అటు చిరు ఫ్యాన్స్‌, ఇటు వెంకీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. గతంలో వెంకటేష్, పవన్ కళ్యాణ్‌తో కలిసి గోపాల గోపల సినిమాలో నటించగా.. అజ్ఞాతవాసి సినిమాలో వెంకీ మామ గెస్ట్ రోల్ ప్లే చేశాడు.ఈ చిత్రం చిరంజీవికి 154వ మూవీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చిరు అండర్ కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో.అయితే నెటిజన్స్ మాత్రం ట్రోల్ చేస్తున్నారు. ఇంకెంతమంది హీరోలు నటిస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాంటి ఫ్యాన్స్ అయితే ఏ చిరు సోలోగా హిట్ కొట్టలేకపోతున్నాడా అంటూ ట్రోల్ చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: