మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఆచార్య మూవీ మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులను కూడా నిరుత్సాహపరిచింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మూడు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. అందులో బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తేరక్కెక్కుతున్న మూవీ ఒకటి.

మూవీ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ చిరంజీవి కెరియర్ లో 154 వ మూవీ గా తెరకెక్కుతూ ఉండడంతో ఈ మూవీ షూటింగ్ ని మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో  జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించండి. కాక పోతే ఏ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు అనేది మాత్రం చిత్ర బృందం ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 13 జనవరి 2023 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: